జనగామ:
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA )శుక్రవారం నియోజకవర్గంలోని రెండు వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించారు.
మొదటగా తరిగొప్పుల మండల కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్లో జరిగిన మాజీ సర్పంచ్ దామెర ప్రభుదాసు కుమార్తె నిషి వివాహ వేడుకకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వారి దాంప త్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నర్మెట్ట మండలం ఇసుక బాయి తండాకు చెంది న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోత్ రాములు కుమారుడు రాజు కుమార్ వివాహ వేడుకకు ముఖ్య అతి థిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై నూతన వధూవ రులను ఆశీర్వదించి వారి భవిష్యత్ జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

















