రసూలాబాద్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
- ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా
కొమురవెల్లి : కొమురవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ (dr. B. R ambdker )జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, స్థానిక నాయ కులు, మహిళలు, యువ కులు భారీగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనం తరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబే ద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య హక్కు ల కోసం చేసిన కృషి నేటికీ మార్గదర్శకమన్నారు. ఈ విగ్ర హం గ్రామ యువతకు స్ఫూర్తి నిస్తుందన్నారు. విద్య, ఆరో గ్యం, అభివృద్ధి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపుని చ్చారు. గ్రామస్తులు స్వయంగా విగ్రహాన్ని నిర్మించుకోవడం సామాజిక చైతన్యానికి నిదర్శనమని ఆయన అభినంద నలు తెలిపారు.

















