గాగిల్లపురంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణము
- ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా
మద్దూర్:
మద్దూరు మండలం గాగిల్లపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్. అంబే ద్కర్(dr.Br.Ambdker )జయంతి సందర్భంగా మంగళ వారం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ భారత ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు. సమానత్వం, న్యాయం, హక్కులే ఆయన చూపిన మార్గం. ఆ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పేర్కొన్నారు.

















