17.3 C
London
Wednesday, July 15, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

0
  • బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరిగి..చివరకు బలవన్మరణం
  • రిటైర్మెంట్ బకాయిలే మల్లయ్య ప్రాణాలు తీశాయి
  • కాంట్రాక్టర్ల చెల్లింపులు ఆపితే రిటైర్మెంట్ బకాయిలన్నీ చెల్లించవచ్చు
  • విశ్రాంత ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
  • రిటైర్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇవ్వాలి

రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్యపై రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే పల్లా తీవ్ర ఆగ్రహం..

జనగామ:

ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మ హత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం. విశ్రాంత ఉపా ధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA RAJESWER REDDY)రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయు డు పగిడిపల్లి మల్లయ్య(Retired teacher Pagidipalli Mallayya)కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానిక బీఆర్‌ ఎస్ నాయకులతో కలిసి పరామర్శించా రు. ఈ సందర్బంగా మల్లయ్య చిత్రపటానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి భార్య అనిత, కుమారుడు భార్గవ్‌ను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..

  • ఉపాధ్యాయుడిగా దాదాపు 35 సంవత్సరాలు సేవలం దించిన మల్ల య్యకు ఉద్యోగ విరమణ అనంతరం రావా ల్సిన పీఎఫ్, జీపీఎఫ్, గ్రాట్యుటీతో పాటు ఇతర రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. బకాయిల కోసం పలు మార్లు అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదన్నారు.
  • కూతురు వివాహం కోసం చేసిన అప్పులు, వాటిపై పెరిగిన వడ్డీలు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన మల్లయ్య, తన లాంటి విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మ హత్యలకు పాల్పడవద్దని లేఖలో పేర్కొంటూ చివరకు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత విషాదకరమన్నారు.
  • జీవితాంతం ఇతరులకు సేవ చేసిన వ్యక్తి చివరికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
  • డబ్బులు లేక ఆసుపత్రుల్లో చేరలేక మరణించిన విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తర్వాత బిల్లులు కూడా చెల్లించలేని పరి స్థితులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరుగు తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని విమ ర్శించారు.
  • ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడటం మానేసి, కాంట్రా క్టర్లకు చెల్లించే నిధులను ఒక్కరోజు నిలిపివేసినా విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెం ట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లించవచ్చని సూచించారు.
  • రిటైర్మెంట్ బకాయిల కోసం కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిర గాల్సిన పరిస్థితి రావడం అత్యంత దుర దృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బకాయిలను విడు దల చేయాలని డిమాండ్ చేశారు.
  • అనంతరం మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here