- వధూవరులకు ఆశీస్సులు అందజేసిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వివాహ వేడుకల్లో(For wedding celebrations in Jangaon constituency) జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వ దించారు. ఈ సందర్బంగా ముందుగా కొమురవెల్లి మండ లంలోని పవర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన చుంచు యాద య్య కుమార్తె సుప్రజ వివాహ వేడుకకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే చేర్యాల మండలంలోని రేణుకా గార్డెన్స్లో నిర్వహించిన గౌరా యపల్లి గ్రామానికి చెందిన కొయ్య శ్రీనివాస్ కుమార్తె అనూష వివాహ వేడుకల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదిం చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడి వారికి శుభాభినందనలు తెలియజేశారు.
ఇదే సందర్భంగా చేర్యాల పట్టణంలోని శివప్రసన్న గార్డె న్స్లో జరిగిన బచ్చన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిడుగు రాజ పతి కుమార్తె హారిక వివాహానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై వధూవరు లకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ నూతన దంపతులు పరస్పర ప్రేమాభి మానాలతో ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాం క్షించారు.

















