- స్వయం సహాయక బృందాల బలోపేతమే మహిళా సాధికారతకు మార్గం
- రాంపూర్, శబాష్గూడెం, నాగపూరి, పెద్దరాజుపేట గ్రామాల్లో వీఓ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల మండలంలోని రాంపూర్, శబాష్గూడెం, నాగపూరి, పెద్దరాజుపేట గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన స్వయం సహాయక బృందాల వీఓ భవనాల ప్రారంభోత్సవ కార్యక్ర మాలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAGAMA MLA PALLA RAJESWER REDDY) ముఖ్య అతిథిగా హాజరై భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు స్వయం సహాయ క బృందాలు బలమైన వేదికగా నిలుస్తున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు..
- ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం కల్పిస్తున్న అవకాశా లు, స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మహిళల కు సూచించారు.
- వీఓ భవనాల నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పొదుపు, రుణాల నిర్వహణ, కార్యా చరణ ప్రణాళికలు మరింత సమర్థవంతంగా నిర్వహించేం దుకు శాశ్వత వేదిక అందుబాటులోకి వచ్చింది.
- మహిళల సాధికారతే గ్రామాభివృద్ధికి బలమైన పునాది అని, స్వయం సహాయక బృందాలు గ్రామీణ ఆర్థిక వ్యవ స్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

















