- ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
దూల్మెట్ట:
దూల్మెట్ట మండలం బెక్కల్ గ్రామంలో గురువారం గ్రామ దేవతల పండుగలు భక్తి శ్రద్దల మధ్యలో వైభవంగా జరి గాయి. గ్రామంలోని ప్రజలందరూ ఏకమై భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠాపన చేసుకోవడంతో పాటు బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజే శ్వర్ రెడ్డి (JANAGAMA MLA PALLA)హాజరయ్యారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు..
ఎమ్మెల్యే పల్లా పాయింట్స్:
- గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో బొడ్రాయిని ప్రతిష్ఠించుకోవడం అభినందనీయం.
- గ్రామ దేవత దీవెనలతో ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం ఆయు రారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటున్నాను.

















