- లద్దునూర్ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ, పెద్దరాజుల విగ్రహ ప్రతిష్ఠాపన
- ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
మద్దూర్:
మద్దూర్ మండలం లద్దునూర్(Laddunoor)గ్రామంలో ముదిరాజ్ కుల స్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన పెద్దమ్మ, పెద్ద రాజుల విగ్రహ ప్రతిష్ఠాపన కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమా నికి ఆదివారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Mla Palla Rajeswer Reddy) హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొ న్నారు. అనంతరం ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సన్మా నించారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ...
- అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరి ఇంటా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల గాలి.
- మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, కులదైవాలను పూజించడం వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి..
- ముదిరాజ్ కులస్తుల ఐక్యత అభినందనీయం. గ్రామాభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

















