- పార్టీ కోసం ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేం
- కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రవీణ్ కుమారుడి జన్మదిన వేడుకలు
- ఆయన సేవలను స్మరించుకున్న ఎమ్మెల్యే పల్లా
జనగామ:
దివంగత బీఆర్ఎస్ నాయకుడు పానుగంటి ప్రవీణ్ సతీ మణి, జనగామ 13వ వార్డు కౌన్సిలర్ పానుగంటి సువార్త కుమారుడి జన్మదిన వేడుకలు(13th Ward Councilor Panuganti Suvartha’s son’s birthday celebrati ons)బుధవారం జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని చిన్నారికి జన్మదిన శుభా కాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…దివంగత పాను గంటి ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందించిన సేవ లు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ కోసం ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, నాయకత్వంపై ఉన్న విశ్వా సం కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుం బానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంద న్నారు. వారి సంక్షేమం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

















