జనగామ:
జనగామ పట్టణ కాంగ్రెస్ నాయకుడు(Congress leader) చెంచరపు బుచ్చిరెడ్డి మాతృమూర్తి ప్రమీల శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి నివాసానికి చేరుకు న్నారు. వారి భౌతికకాయానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజే శారు. ఈ కష్టసమయంలో కుటుంబ సభ్యులకు భగవంతు డు ధైర్యాన్ని ప్రసాదించాలని పల్లా ఆకాంక్షించారు.

















