17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా  

0
  • రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

తరిగొప్పుల:

తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామంలో(solipuram village)తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అల్డ బాలరాజు కుమారుడు రామచరణ్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న జన గామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం వెంటనే సోలిపురం గ్రామానికి చేరుకొ ని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచే శారు. అనంతరం రామ చరణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యు లను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే పల్లా

చేతికొచ్చిన కొడుకు నూరేళ్ల జీవితం రోడ్డు ప్రమాదంలో ముగిసిపోవడం అత్యంత బాధాకరం. బాలరాజు కుటుంబా నికి జరిగిన నష్టం పూడ్చ లేనిదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దు..బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here