- నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
జనగామ నియోజకవర్గంలోని పలు వివాహ వేడుకల్లో (Attended weddings)శనివారం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చేర్యాల పట్టణ కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగిన గుజ్జుక రవి కుమార్తె మాధవి వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజే శారు. దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసం తోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
అలాగే మద్దూరు పట్టణంలోని ఏఆర్ గార్డెన్ లో జరిగిన బొమ్మెర మల్లారెడ్డి కుమార్తె వివాహ వేడుకకు కూడా ఎమ్మె ల్యే పల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

















