- చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా
- ప్రతి కుటుంబ వేడుకలో పాల్గొంటూ ప్రజల మనసులు గెలుచు కుంటున్న ఎమ్మెల్యే
జనగామ:
జనగామ నియోజకవర్గంలోని పలు వివాహ, కుటుంబ వేడుకలకు సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ (Palla Rajesh war Reddy) హాజరైయ్యారు. ఈ సందర్బంగా చేర్యాల పట్టణ కేంద్రంలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన దారబోయిన యాదమ్మ కృష్ణ దంపతుల కుమారుడు సంతోష్ కుమార్ రిసెప్షన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.
అనంతరం జనగామ మండలం వెంకీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి లక్ష్మి నర్సయ్య మనవరాలి సారీ ఫంక్షన్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యు లతో ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రజలతో మమేకమ వుతూ ప్రతి కుటుంబ వేడుకలో పాల్గొంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్థానికులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


















