- అధినేత రాకతో కిక్కిరిసిపోయిన సభ ప్రాంగణం
జగిత్యాల:
జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా సభ ఘన విజ యం సాధించింది. లక్షకు పైగా ప్రజలు హాజరై సభా ప్రాంగ ణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత K.Chandrashekar Rao పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు పాయింట్స్:
- ఇంకా రెండేళ్లలో బీఆర్ఎస్దే అధికారం…తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞాన్ని మళ్లీ ప్రారంభిస్తాం.
- నేను చావను కొడకా..! చివరి దాకా తెలంగాణకు సేవ చేస్తా అంటూ భావోద్వేగంగా గర్జించారు.
- హామీలు వదిలేసి, స్కాంలలో మునిగిపోయిన కాంగ్రెస్ ను ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
- జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు మరింత ఊపు వచ్చిం ది. ఆయనను వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియ మించారు.
- మళ్లీ అధికారంలోకి వచ్చిన తొలి రోజే హైడ్రాను ఎత్తి చెరువుల్లో పారేస్తాం…తిరిగి వచ్చే ప్రభుత్వం బీఆర్ ఎస్దే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- ప్రతి రంగంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగింది. రైతుల పరిస్థితి మళ్లీ దెబ్బతిందని విమర్శించారు.
- నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఎటు చూసినా అభివృద్ధి కనిపించడం లేదు.
- మా సభలు అంటే రైతుబంధు గుర్తుకొస్తుంది…మూడో దఫా కోసం మరోసారి సభ పెట్టాలా? అంటూ ప్రశ్నించా రు.
- యూరియా సరఫరా కూడా చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
- కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, కాల్చివేతలే జరుగు తున్నాయి. మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది.
- మిషన్ భగీరథ ద్వారా ఇచ్చిన తాగునీరు, నిరంతర విద్యుత్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
- మొత్తంగా కేసీఆర్ సభ సూపర్ సక్సెస్గా నిలిచి, బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

















