- నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ మాజీ సర్పంచ్ ఏల్లా రెడ్డి మాతృమూర్తి పెడుతల మల్లమ్మ అనారోగ్యంతో కన్ను మూశారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA)బుధవారం వెంటనే ముస్త్యాల గ్రామానికి చేరుకున్నారు. మల్లమ్మ భౌతికకాయా న్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డిని, వారి కుటుం బ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

















