- పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:

జనగామ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పట్టణ నాయకుడు నీల యాదగిరి తల్లి నీల కొంరమ్మ సోమవారం అనారోగ్యం తో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA) వెంటనే ఆసుపత్రికి చేరుకుని కొంరమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నీల యాదగిరితో పాటు వారి కుటుంబ సభ్యులను పరామ ర్శించి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

















